KCR : నేటి నుంచి సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన

KCR : నేటి నుంచి సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన
KCR : జాతీయ రాజకీయాలపై తెలంగాణ కేసీఆర్‌ మరోసారి దృష్టిసారించారు. జాతీయ స్థాయిలో పలు రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా పర్యటించనున్నారు.

KCR : జాతీయ రాజకీయాలపై తెలంగాణ కేసీఆర్‌ మరోసారి దృష్టిసారించారు. జాతీయ స్థాయిలో పలు రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా పర్యటించనున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించి నేతలతో చర్చలు జరిపిన గులాబీ బాస్....​ఈసారి జాతీయస్థాయిలో పలు రాజకీయ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్లాన్‌ చేసుకోవడం ఆసక్తి రేపుతోంది. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్న కేసీఆర్‌.. వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. ప్రముఖ ఆర్థికవేత్తలతో భేటీ కానున్న ఆయన.. దేశ ఆర్ధిక పరిస్థితులపై చర్చించనున్నారు. అదేవిధంగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థల జర్నలిస్టు ప్రముఖులతో సమావేశాలు నిర్వహించనున్నారు.

ఇక ఈనెల 22 మధ్యాహ్నం ఢిల్లీ నుంచి చండీగఢ్​వెళ్లనున్పనారు. గతంలో ప్రకటించినట్లుగా జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీకి చెందిన సుమారు 600 రైతు కుటుంబాలను పరామర్శించనున్నారు. వారికి ఆర్థికంగా భరోసా అందించేందుకు ఒక్కో కుటుంబానికి 3 లక్షల చొప్పున ఆర్ధిసాయం అందించనున్నారు. ఆ చెక్కుల పంపిణీలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌సింగ్‌లు పాల్గొంటారు.

అలాగే ఈనెల 26న బెంగళూరు వెళ్లనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో సమావేశం కానున్నారు. మరుసటిరోజు రాలేగావ్‌ సిద్ధి వెళ్లనున్న గులాబీదళపతి.. ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేతో భేటీకానున్నారు. అనంతరం షిర్డీ వెళ్లి సాయిబాబా దర్శనం చేసుకోనున్నారు. అక్కడ నుంచి తిరిగి హైదరాబాద్‌ చేరుకుంటారు. అతర్వాత మళ్లీ ఈ నెల 29, 30 తేదీల్లో బంగాల్‌, బిహార్‌లో పర్యటిస్తారు. గల్వాన్ లోయలో వీరమరణం పొందిన భారత సైనిక కుటుంబాలను సీఎం పరామర్శిస్తారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగా వారి కుటుంబాలను కేసీఆర్​ఆదుకోనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story