CM KCR : రోశయ్య మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం ..!

X
CM KCR : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆర్థిక శాఖ సహా అనేక మంత్రి పదవులకు రోశయ్య వన్నె తెచ్చారని సౌమ్యుడిగా, సహన శీలిగా, రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించేవారు అని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.రోశయ్య మృతిపట్ల మాజీ సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్థిక నిపుణుడిగా, పాలన దక్షుడిగా పేరు ప్రఖ్యాతులు గడించారని గుర్తు చేసుకున్నారు. విద్యార్థి సంఘ నాయకుడి నుంచి గవర్నర్ స్థాయికి అంచలంచెలుగా ఎదిగారన్నారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
