ప్రధానితో భేటీ.. పది అంశాల పై లేఖలు ఇచ్చిన కేసీఆర్..!
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్... ప్రధానమంత్రి నరేంద్రమోదీ భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన పలు కీలక అంశాలపై విజ్ఞాపనలు అందించారు. విభజన చట్టంలోని హామీలు సహా పలు విద్యా సంస్థలు, పరిశ్రమల స్థాపనకు సహకరించాలంటూ 10 లేఖలు సమర్పించారు. వరంగల్ టెక్స్టైల్ పార్క్కు వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరారు.
హైదరాబాద్ - నాగ్పూర్ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని నివేదించారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి నిధులివ్వాలని కోరారు. విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఐపీఎస్ సీనియర్ డ్యూటీ పోస్టులు 76 నుంచి 105కు పెంచాలని సీఎం కేసీఆర్... ప్రధాని మోదీని కోరారు. ఐపీఎస్ క్యాడర్ సంఖ్య 139 నుంచి 195కు పెంచాలని విజ్ఞప్తి చేశారు.
9 జిల్లాల్లో మాత్రమే జవహర్ నవోదయ పాఠశాలలు ఉన్నాయని, మరో 21 జిల్లాలకు మంజూరు చేయాలని కోరారు. హైదరాబాద్కు IIM ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లాకు ట్రిపుల్ ఐటీ మంజూరు చేయాలని విజ్ఞాపన అందచేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com