కరోనా నుంచి కోలుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్

X
By - TV5 Digital Team |5 May 2021 10:15 AM IST
వ్యవసాయ క్షేత్రంలో వ్యక్తిగత వైద్యుడు ఎంవి రావు ఆధ్వర్యంలోని వైద్య బృందం నిన్న కేసీఆర్కు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కరోనా సోకడంతో సీఎం కేసీఆర్ ఐసోలేషన్లో ఉంటున్నారు. వ్యవసాయ క్షేత్రంలో వ్యక్తిగత వైద్యుడు ఎంవి రావు ఆధ్వర్యంలోని వైద్య బృందం నిన్న కేసీఆర్కు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. రాపిడ్ యాంటీజెన్తో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా రెండింటిలోనూ నెగెటివ్గా రిపోర్టులు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. రక్త పరీక్షల రిపోర్టులు కూడా సాధారణంగా ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు వైద్యులు నిర్ధారించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com