KCR : తెలంగాణ వచ్చాక సంపద బాగా పెరిగింది : కేటీఆర్
By - TV5 Digital Team |12 Feb 2022 10:30 AM GMT
KCR : తెలంగాణ వచ్చాక సంపద బాగా పెరిగిందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. సమైక్యరాష్ట్రంలో చెరువులు నిర్లక్ష్యానికి గురై కరువు కాటకాలు వచ్చాయన్నారు.
KCR : తెలంగాణ వచ్చాక సంపద బాగా పెరిగిందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. సమైక్యరాష్ట్రంలో చెరువులు నిర్లక్ష్యానికి గురై కరువు కాటకాలు వచ్చాయన్నారు. మిషన్ కాకతీయతో చెరువులను అభివృద్ధి చేశామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ సముదాయాన్ని మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరెట్ భవనాన్ని ప్రారంభించిన అనంతరం కార్యాలయంలోని గదులను పరిశీలించారు. ఈసందర్భంగా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ అద్భుతమైన ఆర్ధిక శక్తిగా ఎదుగుతుందని...ఉద్యోగులకు కేంద్రం కంటే ఎక్కువ జీతాలు ఇస్తున్నట్లు తెలిపారు. తెలంగాణాలో భూముల విలువ భారీగా పెరిగాయన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com