CM KCR : కరోనా రోగులకి దైర్యం చెప్పిన సీఎం కేసీఆర్..!
By - TV5 Digital Team |21 May 2021 8:44 AM GMT
CM KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ చేరుకున్నారు. వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రికి చేరుకుని అక్కడ కరోనా బాధితులు పరిస్థితులను పరిశీలించారు.
CM KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ చేరుకున్నారు. వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రికి చేరుకుని అక్కడ కరోనా బాధితులు పరిస్థితులను పరిశీలించారు. వారికి అందుతున్న వైద్యసేవల గురంచి అడిగి తెలుసుకున్నారు. అక్కడి రోగులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు కేసీఆర్. ఆస్పత్రిలో పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్లు, రెమ్డెసివిర్, ఇతర మందుల లభ్యత తదితర అంశాలపై అధికారులతో సీఎం చర్చించనున్నారు. అనంతరం కేసీఆర్.. వరంగల్ సెంట్రల్ జైలును పరిశీలించనున్నారు. జైలు ప్రాంగణంలోని 73 ఎకరాల్లో కొత్త ఆస్పత్రి నిర్మాణంపై కేసీఆర్.. అధికారులతో చర్చించనున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com