TG:ఢిల్లీ ఫలితాలపై స్పందించిన రేవంత్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోవడానికి ఆప్ కారణమైతే.. ఢిల్లీలో ఆప్ ఓటమికి కాంగ్రెస్ కారణమైందన్నారు. ఇండియా కూటమిలో విబేధాల కారణంగా చివరకు బీజేపీ లాభపడుతోందని సీఎం పేర్కొన్నారు. ఇప్పుడు ప్రజలు కేవలం అధికార, ప్రతిపక్ష పార్టీలకు మాత్రమే ఓట్లు వేస్తున్నారని.. మూడో పార్టీకి స్థానం ఇవ్వట్లేదని సీఎం రేవంత్ వెల్లడించారు. ఇండి కూటమిలో విభేదాలు ఉన్న మాట వాస్తవమే అని సీఎం అన్నారు. ఇండి కూటమిలో విబేధాల కారణంగా... చివరకు బీజేపీ లాభపడుతోందని రేవంత్ అన్నారు. ఇదే మాటను ఢిల్లీ ఫలితాల అనంతరం జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా అన్నారు. ఇండి కూటమిలో తన్నులాటతో కమలం పార్టీ లాభపడుతోందని అన్నారు.
సీఎం రేవంత్పై కేటీఆర్ సెటైర్లు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవని విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. ‘మన ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి ఢిల్లీలో ప్రచారం చేశాడు. దీంతో ఆ పార్టీ సున్నాకే పరిమితం అయ్యింది. కాంగ్రెస్ పార్టీ నాశనం అయ్యింది. రాహుల్ గాంధీ బీజేపీ మరోసారి గెలిపించారు. బీజేపీని గెలిపించిన రాహుల్కు కంగ్రాట్స్’ అని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ
సీఎం రేవంత్కి మాజీ మంత్రి హరీష్ బహిరంగ లేఖ రాశారు. ‘సిద్దిపేటలోని కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్వాసితులకు అండగా ఉంటానని ఆనాడు మీరు ఏటిగడ్డ కిష్టాపూర్లో నిరాహారదీక్ష చేపట్టారు. ఆ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత సీఎంగా ఉన్న మీపై ఉంది. BRS హయాంలో R&B ప్యాకేజీ, పునరావాస కాలనీల నిర్మాణం, ఇంటి స్థలాలు 90% పూర్తయ్యాయి. మిగిలిన 10% పనులను పూర్తి చేయండి. ’ అని లేఖలో రాశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com