REVANTH: డిజిటల్ హెల్త్ కార్డులపై కీలక ప్రకటన

తెలంగాణ డిజిటల్ హెల్త్ కార్డులపై కీలక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మరో 30 రోజుల్లో ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం విద్య, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని.. పేదలకు అతి తక్కువ ఖర్చుతో వైద్య అందించాల్సి ఉందని అన్నారు. ప్రతీ ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ను డిజిటలైజ్ చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వైద్య, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని రేవంత్రెడ్డి చెప్పారు. పేదలకు అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించాల్సిన అవసరం ఉందన్నారు. అందరికీ మెరుగైన వైద్యం అందాలనేదే తమ లక్ష్యమని అన్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ కింద వైద్యం ఖర్చును రూ.10లక్షలకు పెంచిన విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి గుర్తు చేశారు. రాబోయే 30 రోజుల్లో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ విడి విడిగా హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది ప్రజల హెల్త్ ప్రొఫైల్స్ను డిజిటలైజ్ చేయాల్సి ఉందన్నారు. ఆ హెల్త్ కార్డుల్లో గత చికిత్స వివరాలు అన్నీ ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. . దుర్గాబాయి దేశ్ముఖ్ సంఘం ప్రతినిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో భాగం కావాలని సీఎం రేవంత్రెడ్డి కోరారు.
4 కోట్ల హెల్త్ ప్రొఫైల్స్
తెలంగాణలో 4 కోట్ల ప్రజల హెల్త్ ప్రొఫైల్స్ డిజిటలైజ్ చేయాల్సి ఉందని.. ఈ హెల్త్ కార్డుల్లో గత చికిత్స వివరాలు పొందుపరుస్తారని సీఎం రేవంత్ వివరించారు. 'పేదలకు వైద్యం అందించడంలో దుర్గాబాయి దేశ్ ముఖ్ హాస్పిటల్ మరొక అడుగు ముందుకు వేయడం అభినందనీయం. క్యాన్సర్ మహమ్మారితో చాలామంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో క్యాన్సర్ వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆస్పత్రి యాజమాన్యం మా దృష్టికి తీసుకొచ్చిన ప్రతిపాదనలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తాం. దుర్గాభాయ్ దేశ్ముఖ్ సంఘం ప్రతినిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి.' అని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com