T-Congress: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేపై మండిపడుతోన్న టీకాంగ్రెస్..
By - Prasanna |6 Jan 2023 6:44 AM GMT
T-Congress: 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై గెలిచి.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేపై టీకాంగ్రెస్ మండిపడుతోంది.
T-Congress: 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై గెలిచి.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేపై టీకాంగ్రెస్ మండిపడుతోంది. పార్టీ మారిన 12మంది ఎమ్మెల్యేపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది టీపీసీసీ. సీఎల్పీ కార్యాలయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో సీనియర్ నేతలు భేటీ కానున్నారు.
సమావేశం అనంతరం పోలీసులకు ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయనుంది టీకాంగ్రెస్. మరోవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు జరిగిన రాజకీయ, ఆర్ధిక లబ్ధిపై ప్రజలకు వివరిస్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు.. నలుగురు ఎమ్మెల్యేపై సీబీఐ, హైకోర్ట్లో విచారణ జరుగుతున్న నేపధ్యంలో కాంగ్రెస్ ఫిర్యాదుపై ఆసక్తి నెలకొంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com