తెలంగాణలో కొత్తగా 1873 మందికి కరోనా నిర్ధారణ

X
By - Admin |31 Aug 2020 9:27 AM IST
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. 24 గంటల్లో 1873 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 360 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒక్క రోజులో 9 మంది మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య లక్షా 24 వేల 963కు చేరింది. తెలంగాణలో మొత్తం యాక్టివ్ కేసులు 31వేల 299 కాగా కరోనా నుంచి కోలుకుని 92,837 మంది డిశ్చార్జ్ అయ్యారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com