Eamcet 2021 : తెలంగాణలో ఎంసెట్ గడువు పెంపు...!

X
By - TV5 Digital Team |3 Jun 2021 5:00 PM IST
కరోనా నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమలో పలు పరీక్షలు వాయిదా పడుతున్నాయి. మరికొన్నింటిని రద్దు చేస్తున్నారు.
కరోనా నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమలో పలు పరీక్షలు వాయిదా పడుతున్నాయి. మరికొన్నింటిని రద్దు చేస్తున్నారు. పలు పరీక్షల దరఖాస్తు గడువును సైతం అధికారులు పొడిగిస్తున్నారు. అందులో భాగంగానే ఎంసెట్ దరఖాస్తు గడువు నేటితో ముగియనుండగా మరోసారి పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా జూన్ 10 వరకు అప్లై చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ తెలిపారు. జూలై 5 నుంచి 9 వరకు కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. eamcet.tsche.ac.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు: జనరల్ కేటగిరి రూ.800, SC/ST/ PHలకు రూ.400.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com