Telangana: యూట్యూబ్‌ వార్తా చానెళ్లకు కళ్లెం.. రాష్ట్ర ప్రభుత్వ యోచన

Telangana: యూట్యూబ్‌ వార్తా చానెళ్లకు కళ్లెం.. రాష్ట్ర ప్రభుత్వ యోచన
Telangana: తాజాగా సీఎం కేసీఆర్‌ మనవడిపై ఓ యూట్యూబ్‌ చానల్‌లో అభ్యంతకర వ్యాఖ్యలతో ఈఅంశం మరోసారి తెరమీదకొచ్చింది.

Telangana: తెలంగాణలో యూట్యూబ్‌ వార్తా చానెళ్లకు కళ్లేం వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అడ్డు అదుపూలేకుండా అసత్య విద్వేషపూరిత వార్తలను ప్రసారం చేస్తున్న చానళ్లపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలోనూ చానళ్ల నియంత్రణపై చర్యలు చేపట్టాలని డిమాండ్‌ వినిపించింది.

తాజాగా సీఎం కేసీఆర్‌ మనవడిపై ఓ యూట్యూబ్‌ చానల్‌లో అభ్యంతకర వ్యాఖ్యలతో ఈఅంశం మరోసారి తెరమీదకొచ్చింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు.. చానళ్లకు ముకుతాడుపై ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ కసరత్తు ప్రారంభించింది.

స్వేచ్ఛ పేరిట కులాల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు కొందరిని లక్ష్యంగా చేసుకుని దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్న చానెళ్లను నియంత్రించాలని ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రూల్స్‌- 2021ను తీసుకొచ్చింది.

దీని ప్రకారం యూట్యూబ్‌, ఇతర ఆన్‌లైన్‌ న్యూస్‌ చానెళ్లలో అసత్య, విద్వేషపూరిత వార్తలు ప్రసారం చేస్తే సంబంధిత చానెళ్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రకటించింది. ప్రసారాలపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించడం, వాటిని గరిష్ఠంగా 15 రోజుల్లోపు పరిష్కరించడం చానెళ్ల బాధ్యతని కేంద్ర స్పష్టం చేసింది.

రాష్ట్రంలో దాదాపు 200 వరకు యూట్యూబ్‌ వార్తా చానెళ్లున్నాయి. ఈ నిబంధనలను అన్ని యూట్యూబ్‌ న్యూస్‌ చానెళ్లు కచ్చితంగా పాటించేలా చూసేందుకు ఐటీశాఖ త్వరలో వారితో సమావేశం ఏర్పాటు చేయనుంది. ప్రజల నుంచి అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రతి చానెల్‌ తప్పనిసరిగా అన్నివివరాలను ఇవ్వాల్సి ఉంటుందని ఐటీ శాఖ ఉన్నతాధికారి తెలిపారు.

జర్నలిజంపై ఏమాత్రం అవగాహన లేని వారు సైతం యూట్యూబ్‌ చానెళ్లను నిర్వహిస్తున్నారన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, నిబంధనల గురించి వారికి తెలియదని పేర్కొన్నారు. త్వరలో చానెళ్ల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి నిబంధనలు వివరిస్తామని తెలిపారు. అలాగే రాష్ట్రంలోని యూట్యూబ్‌ చానెళ్లన్నీ కేంద్ర మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించేలా చూడాలంటూ యూట్యూబ్‌కు లేఖ రాయనున్నట్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story