ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స, టెస్టుల ధరలను నిర్ణయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో..!

ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స, టెస్టుల ధరలను నిర్ణయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో..!
ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స, టెస్టుల ధరలను నిర్ణయిస్తూ తెలంగాణ ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ జీవో నెంబర్‌ 40 జారీ చేసింది.

ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స, టెస్టుల ధరలను నిర్ణయిస్తూ తెలంగాణ ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ జీవో నెంబర్‌ 40 జారీ చేసింది. సాధారణ వార్డులో ఐసోలేషన్, పరీక్షలకు రోజుకు 4వేల రూపాయలు, ఐసీయూ గదిలో రోజుకు 7వేల 500 రూపాయలు, వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ గదికి రోజుకు గరిష్ఠంగా 9వేల రూపాయలు, పీపీఈ కిట్ ధర 273 రూపాయలుగా నిర్ణయించారు.

ఇక హెచ్ఆర్‌ సీటీ ధర ఒకవేయి 995 రూపాయలు, డిజిటల్ ఎక్స్ రే 1300 రూపాయలు, ఐఎల్6 1300 రూపాయలు, డీడైమర్ 300, సీఆర్‌పీ అయితే 500, ప్రొకాల్ సీతోసిన్ 1400, ఫెరిటీన్ 400, ఎల్‌డీహెచ్‌కు 140 రూపాయలు తీసుకోవాలని నిర్దేశించింది.

సాధారణ అంబులెన్స్‌కు కిలోమీటరుకు 75 రూపాయలు, మినిమం ఛార్జి కింద 2వేలు మాత్రమే తీసుకోవాలి. ఇక వసతులతో కూడిన అంబులెన్సుకు కిలోమీటరుకు 125 రూపాయలు, మినిమం ఛార్జి 3వేలు మాత్రమే వసూలు చేయాలి.

Tags

Read MoreRead Less
Next Story