కరోనా పరిస్థితుల పైన హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వ నివేదిక..!

కరోనా పరిస్థితుల పైన హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వ నివేదిక..!
రాష్ట్రంలోని కరోనా పరిస్థితుల పైన హైకోర్టు నివేదికను సమర్పించింది తెలంగాణ ప్రభుత్వం..

రాష్ట్రంలోని కరోనా పరిస్థితుల పైన హైకోర్టు నివేదికను సమర్పించింది తెలంగాణ ప్రభుత్వం.. ఇందులో కొవిడ్‌ పరీక్షలు, కట్టడికి చేపడుతున్న చర్యల గురించి నివేదికలో పేర్కొంది.

నివేదికలోని ముఖ్యాంశాలు..

* రాష్ట్రంలో ఈ నెల 1 నుంచి 25 వరకు మొత్తం 23.55 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించాం. ఇందులో 4.39 లక్షల RTPCR, 19.16లక్షల ర్యాపిడ్‌ పరీక్షలు ఉన్నాయి.

* ఈ నెల 1 నుంచి 25 వరకు 341 మంది కరోనాతో మృతి చెందారు.

* రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ రేటు 3.5 శాతంగా ఉంది.

* క‌రోనా ప‌రీక్షల పెంపున‌కు చ‌ర్యలు చేప‌డుతున్నాం.

* కరోనాపై నిపుణుల కమిటీ సమావేశాలు ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి.

* కరోనా కట్టడి కోసం రాష్ట్రంలో మద్యం దుకాణాలు, పబ్‌లు నిబంధనలు పాటించేలా చర్యలు. మద్యం దుకాణాలను అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నారు.

* రాష్ట్రానికి 430 టన్నుల ఆక్సిజన్‌ను కేంద్రం కేటాయించింది. వివిధ ప్రాంతాల నుంచి ఆక్సిజన్‌ను చేరవేస్తున్నాం.

* రెమ్‌డెసివర్‌ పర్యవేక్షణ నోడల్‌ అధికారిగా ప్రీతిమీనాను నియమించామని ప్రభుత్వం నివేదిక‌లో పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story