RTC బిల్లుపై గవర్నర్కు కేసీఆర్ ప్రభుత్వం వివరణ
ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లుపై గవర్నర్కు కేసీఆర్ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. గవర్నర్ లేవనెత్తిన ఐదు అంశాలకు సమాధానం పంపింపి. ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలోకి తీసుకుంటున్నామని.. సంస్థ యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. టీఎస్ఆర్టీసీ కార్పొరేషన్ అలాగే కొనసాగుతున్నందున విభజన చట్టానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని వెల్లడించింది. ఇక కేంద్ర వాటా, గ్రాంట్లు, రుణాల వివరాలు అవసరం లేదని తెలిపింది. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లుపై ఉత్కంఠ నెలకొనడంతో.. బిల్లుపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.
కార్మికుల ప్రయోజనాల పరిరక్షణే బిల్లు ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది. పెన్షన్లు తదితరాలకు సంబంధించి ఎలాంటి అయోమయం లేదని తెలిపింది. కార్మికులను ప్రభుత్వంలోకి తీసుకున్న తర్వాత వారితో చర్చించే నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించింది. వేతనాలు, కరువు భత్యం, కేడర్, పదోన్నతులకు ఎలాంటి సమస్య ఉండదని వివరిస్తూ రాజ్భవన్కు సీఎస్ శాంతికుమారి లేఖ రాశారు. ఈ మేరకు గవర్నర్ అడిగిన అన్ని అంశాలపై వివరణ ఇచ్చామని.. శాసనసభలో ఆర్టీసీ బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి గవర్నర్ను కోరింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com