GHMC ఎన్నికల్లో ఎక్స్అఫిషియో ఓటింగ్ పిటీషన్పై నేడు హైకోర్టు విచారణ

GHMC ఎన్నికల్లో ఎక్స్అఫిషియో ఓటింగ్ పిటీషన్పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగనుంది. గ్రేటర్ ఎన్నికల్లో ఎక్స్అఫిషియో ఓట్లను అనుమతించవద్దని మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ పిటీషన్ దాఖలు చేశారు. ఎక్స్అఫిషియో ఓట్లకు అనుమతించే జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 90(1)ను పిటీషనర్ సవాలు చేశారు. ఈ సెక్షన్ను చట్ట, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి కొట్టివేయాలని కోరారు. ఎక్కువ కార్పొరేటర్ సీట్లు గెలిచినప్పటికీ ఎక్స్అఫిషియో ఓట్ల వలన మేయర్ను ఎన్నుకోలేక పోతున్నారన్నారని పిటీషనర్ తెలిపారు.
ప్రస్తుతం జీహెచ్ఎంసీలో ఉన్న 150 వార్డుల్లో 55 మంది ఎక్స్అఫిషియో ఓట్లు ఉన్నాయన్నారు పిటీషనర్. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో 55 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటు వేయనున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఎక్స్అఫిషియో ఓటింగ్ కల్పించడం ద్వారా స్థానిక ప్రజల ఉద్దేశం నీరుగారిపోతుందని పిటీషనర్ పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీలను పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com