TS Lockdown: తెలంగాణ లాక్డౌన్ పొడిగించాలా? ప్రభుత్వ నిర్ణయం..

TS Lockdown: తెలంగాణ లాక్డౌన్ పొడిగించాలా? ప్రభుత్వ నిర్ణయం..
ఈ విషయాలపై సంబంధిత అధికారులతో చర్చలు జరిపి సీఎం కేసీఆర్ ఓ నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది.

TS Lockdown: అతి కష్టం మీద లాక్డౌన్ పాటిస్తున్నారు రాష్ట్ర వాసులు. పోలీసులు వెంటబడి లాఠీ తీస్తే కాని ఇళ్లకు వెళ్లడానికి మొగ్గు చూపట్లేదు. మరి ఆ మాత్రం స్ట్రిక్ట్‌గా లేకపోతే కరోనా ధాటికి రాష్ట్రాలు కకావికలమవుతాయి. కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పడుతుండడంతో ఆర్థిక రంగాన్ని పరిపుష్టిం చేసే దిశగా చర్యలు తీసుకునేందుకు సమాయత్తమవుతోంది తెలంగాణ గవర్నమెంట్. ఈ క్రమంలోనే లాక్డౌన్ వేళలను తగ్గించుకుంటూ వచ్చింది. ఇప్పుడు మొత్తానికి లాక్డౌన్ ఎత్తివేయాలని భావిస్తోంది.

ఈ విషయాలపై సంబంధిత అధికారులతో చర్చలు జరిపి సీఎం కేసీఆర్ ఓ నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో అత్యవసర రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. లాక్డౌన్ గడువు శనివారంతో ముగుస్తున్నందున దానిపై నిర్ణయం తీసుకునేందుకు మంత్రి మండలి సమావేశం జరపాలని సీఎం నిర్ణయించారు. మరియు వ్యవసాయంపై రుతుపవనాల ప్రభావం వంటి పలు కీలక అంశాలపై చర్చించడానికి తెలంగాణ కేబినెట్ శనివారం సమావేశం కానుంది. ప్రస్తుత లాక్డౌన్ దశ శనివారం ముగియనుంది మరియు దక్షిణాది రాష్ట్రంలో కోవిడ్ -19 కేసులు తగ్గుతున్నందున ముఖ్యమంత్రి ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. ఈ సమావేశంలో మంత్రివర్గం "రాష్ట్రంలో లాక్డౌన్, వర్షపాతం, రుతుపవనాల సాగు, వ్యవసాయానికి సంబంధించిన కాలానుగుణ సమస్యలు, గోదావరి జలాలను ఎత్తడం, హైడెల్ విద్యుత్ ఉత్పత్తి మరియు ఇతర అంశాలపై చర్చించనున్నట్లు తెలిపింది. . "

మంత్రులందరికీ ఆయనే స్వయంగా ఫోన్ చేసి సమావేశానికి హాజరు కావాలని సీఎం ఆహ్వానించారు. అందుబాటులో ఉన్న మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్ రెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్ తదితరులతో సీఎం శుక్రవారం ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులకు సమాచారాన్ని అందించారు. ప్రాథమికంగా కొన్ని అంశాలతో ఎజెండాను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

కరోనా కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించడం మంచి పరిణామంగా భావిస్తోంది. దీనిపై కూడా వైద్య ఆరోగ్య శాఖ నివేదిక రూపొందించినట్లు తెలుస్తోంది. ఇక కరోనా థర్డ్ వేవ్ గురించి వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రజలకు ఉన్న భయాందోళనలపైనా సీఎం వైద్య ఆరోగ్య శాఖ నుంచి స్పష్టత కోరారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో లాక్‌డౌన్ మినహాపుకే ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మాస్క్‌లు ధరించడం వంటి నిబంధనలను కఠిన తరం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story