ఈ రోజు రాత్రి 8 గంటలకు ఎంసెట్ కీ ..

X
By - Prasanna |15 May 2023 9:53 AM IST
తెలంగాణ ఎంసెట్ పరీక్షలు ఆదివారంతో ముగిశాయి.
తెలంగాణ ఎంసెట్ పరీక్షలు ఆదివారంతో ముగిశాయి. మూడు రోజులు జరిగిన ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షల ప్రాథమిక కీని సోమవారం రాత్రి 8 గంటలకు విడుదల చేస్తామని ఎంసెట్ కన్వీనర్ కార్యాలయం ప్రకటించింది.
విద్యార్థుల రెస్పాన్స్ పత్రాలను కూడా వెబ్ సైట్లో ఉంచుతామని ప్రాథమిక కీపై అభ్యర్థనలను 17వ తేదీ రాత్రి 8 గంటలకు వెబ్ సైట్ లోని లింక్ ద్వారా పంపవచ్చని పేర్కొంది. మొత్తం ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు 94.11 శాతం మంది అభ్యర్ధులు హాజరయ్యారు. 2,05,351 మందికి 1,95,275 మంది పరీక్ష రాశారు. అగ్రికల్చర్ విభాగంలో 1,06,514 మంది పరీక్షకు హాజరయ్యారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com