Harish Rao : కేంద్రానికి లేఖ రాసిన మంత్రి హరీష్‌రావు

Harish Rao : కేంద్రానికి లేఖ రాసిన మంత్రి హరీష్‌రావు
Harish Rao : కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ హెల్త్‌ మినిస్టర్‌ హరీష్‌రావు లేఖ రాశారు..

Harish Rao : కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ హెల్త్‌ మినిస్టర్‌ హరీష్‌రావు లేఖ రాశారు.. ప్రభుత్వ వైద్యంలో 18 నుంచి 59 ఏళ్ల వారికి కరోనా నుంచి రక్షణ కోసం ప్రికాషనరీ డోస్‌ ఇవ్వడానికి అనుమతించాలని కేంద్రాన్ని కోరారు.. భవిష్యత్తులో కొత్త వేరియంట్ల ద్వారా కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉందనే అంచనాల నేపథ్యంలో రెండు డోసులు పూర్తి చేసుకుని అర్హులైన వారికి ప్రికాషనరీ డోస్‌ ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని కేంద్ర ఆరోగ్యమంత్రి మనసుక్‌ మాండవీయకు విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ వైద్యంలో ప్రస్తుతం 60 ఏళ్లు దాటిన వారికి మాత్రమే ప్రికాషనరీ డోస్‌ ఇచ్చేందుకు అనుమతించిన కేంద్రం.. 18 ఏళ్లు పైబడిన వారికి ఏప్రిల్‌ పది నుంచి ప్రైవేటు ఆస్పత్రుల్లో డోస్‌ ఇచ్చేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. ఈ క్రమంలో ప్రైవేటుతో పాటు ప్రభుత్వ కేంద్రాల్లోనూ 18 నుంచి 59 ఏళ్ల వయసున్న వారికి ప్రికాషనరీ డోస్‌ ఇచ్చేందుకు అనుమతించాలని లేఖలో పేర్కొన్నారు.. ఆ దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.. రాష్ట్రంలో ఏప్రిల్‌ 10 నాటికి దాదాపు 9 లక్షలా 84వేలా 24 మంది ప్రికాషనరీ డోస్‌ పొందేందుకు అర్హులుగా ఉన్నారని లేఖలో పేర్కొన్నారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలో 18 ఏళ్లుపైబడిన వారికి మొదటి డోసు 106 శాతం.. రెండో డోసు 100 శాతం.. 15 నుంచి 17 ఏళ్ల వయసు వారికి మొదటి డోసు 90 శాతం, రెండో డోసు 73 శాతం, 12 నుంచి 14 ఏళ్ల వయసు వారికి 78 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తిచేశామని హరీష్‌రావు చెప్పారు.. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడంలో, వ్యాధి ప్రభావాన్ని తగ్గించడంలో విస్తృతంగా నిర్వహించిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఎంతో తోడ్పడిందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు హరీష్‌రావు.

Tags

Read MoreRead Less
Next Story