కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగింది: మంత్రి ప్రశాంత్ రెడ్డి

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగింది: మంత్రి ప్రశాంత్ రెడ్డి
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. నిధుల్లో మొండి చేయి చూపినా.. ఇక్కడి బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. నిధుల్లో మొండి చేయి చూపినా.. ఇక్కడి బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రానికి నిధులు తెప్పించడంలో బీజేపీ ఎంపీలు విఫలమయ్యారని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పర్యటించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి.. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. మంజీర నదిపై సుమారు 16 కోట్ల వ్యయంతో చేపట్టనున్న చెక్ డ్యామ్‌కు శంకుస్థాపన చేశారు. తాగు, సాగు నీటి రంగాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story