మహిళను చూసి ముందుకు వెళ్లి.. యూటర్న్ తీసుకుని మరీ మంత్రి పరామర్శ..!

ప్రజాప్రతినిధులు రోడ్లపై వెళ్తున్నప్పుడు ఏదైనా ప్రమాదాలు చోటుచేసుకుంటే వెంటనే స్పందించి తమ వాహనాల్లోనే ఆస్పత్రులకు తరలించి మానవత్వాన్ని చాటుకుంటూ ఉంటారు. తాజాగా తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి కూడా తన మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు పక్కన ఒంటరిగా కూర్చొని ఉన్న ఓ మహిళను పరామర్శించారు మంత్రి.. ఇక వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి శంకర్పల్లి మండల పర్యటనకు వెళ్తుండగా.. మార్గమధ్యలో లంగర్హౌస్ టిప్పుఖాన్పూల్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఓ మహిళ పడి ఉండటాన్ని సబితా గమనించారు. అయితే అప్పటికే కాన్వాయ్ ముందుకు వెళ్లటంతో డివైడర్ వద్ద యూటర్న్ తీసుకుని ఆ మహిళ వద్దకి వచ్చి మాట్లాడేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఆ మహిళ మాటలు రావని సైగలతో చెప్పడంతో ఆమెకు నీళ్ళు తాగించి నీడలోకి వెళ్లాలని సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com