బీజేపీ కార్యకర్తల నిరసనపై మంత్రి నిరంజన్‌ రెడ్డి ఆగ్రహం

బీజేపీ కార్యకర్తల నిరసనపై మంత్రి నిరంజన్‌ రెడ్డి ఆగ్రహం
రైతు వేదికల ప్రారంభోత్సవాల్లో దేశ ప్రధాని నరేంద్రమోదీ ఫోటో కూడా పెట్టాలంటూ ఆందోళన చేసిన బీజేపీ కార్యకర్తలపై మంత్రి నిరంజన్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతు వేదికల ప్రారంభోత్సవాల్లో దేశ ప్రధాని నరేంద్రమోదీ ఫోటో కూడా పెట్టాలంటూ ఆందోళన చేసిన బీజేపీ కార్యకర్తలపై మంత్రి నిరంజన్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్‌ జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో కొందరు బీజేపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. బ్యానర్‌లో మోదీ ఫోటో లేదంటూ గొడవ చేశారు. దీనిపై ఘాటుగా స్పందించిన మంత్రి నిరంజన్‌ రెడ్డి.. ప్రధానమంత్రిని తక్కువ చేయాలన్న ఉద్దేశం తమకు లేదని.. బీజేపీ కార్యకర్తలే ఇలా ప్రవర్తించి మోదీ గౌరవాన్ని తగ్గిస్తున్నారని మండిపడ్డారు. ప్రతి కార్యక్రమంలో మోదీ ఫోటోలు పెట్టుకోవాలంటూ కేంద్రం నుంచి ఓ జీవో విడుదల చేయించుకోవాలంటూ నిరంజన్ రెడ్డి సెటైర్లు వేశారు.

Tags

Read MoreRead Less
Next Story