భారీ వర్షాలు.. బడులకు శెలవు

నగరం, శివారు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా హైదరాబాద్ , మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సెలవు ప్రకటించింది.
ట్విట్టర్లో సెలవు ప్రకటనను పోస్ట్ చేస్తూ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి.. భారీ వర్ష సూచన నేపథ్యంలో, హైదరాబాద్లోని అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం ఈ రోజు సెలవు ప్రకటించింది. ఇంట్లోనే ఉండండి మరియు సురక్షితంగా ఉండండి." అని పేర్కొన్నారు.
మేడ్చల్ డీఈవో మాట్లాడుతూ విద్యాశాఖ కార్యదర్శి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అయితే, ఉపాధ్యాయ దినోత్సవ అవార్డు కార్యక్రమం ఈరోజు కొనసాగుతుందని తెలిపారు. విద్యాశాఖ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ , స్థానిక పరిస్థితుల ఆధారంగా ఆయా జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని జిల్లా కలెక్టర్లను కోరినట్లు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com