తెలంగాణలో టీడీపీ గేరప్..గెలుపే లక్ష్యం

తెలంగాణలో టీడీపీ గేరప్..గెలుపే లక్ష్యం
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బస్సు యాత్ర ఉంటుందని తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ వెల్లడించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ... టీటీడీపీ దూకుడు పెంచుతోంది. ఇప్పటికే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంతో జనంలోకి వెళ్లిన తెలుగు తమ్ముళ్లు.. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బస్సుయాత్ర రుట్ మ్యాప్ సిద్ధం చేశారు. నియోజకవర్గ, మండల స్థాయి నాయకులతో చర్చించి ఫైనలైజ్ చేయనున్నారు.

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బస్సు యాత్ర ఉంటుందని తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ వెల్లడించారు. యాత్రను విజయవంతం చేయాలని పార్టీ నాయకులకు సూచించారు. పార్లమెంటు నియోజకవర్గ పార్టీ పరిశీలకులతో కాసాని జ్ఞానేశ్వర్ సమావేశం నిర్వహించారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు, బస్సు యాత్ర విజయవంతంపై చర్చించారు. టీడీపీ తెలంగాణలో బలంగా ఉందనీ నాయకులు వెళ్లినా కేడర్ అలాగే ఉన్నారని...వారిని ఏకతాటిపైకి తీసుకొచ్చి పార్టీని పునర్ నిర్మాణం చేయాలన్నారు కాసాని జ్ఞానేశ్వర్.

Tags

Read MoreRead Less
Next Story