చంద్రయాన్‌-3లో తెలంగాణా యువకుడు

చంద్రయాన్‌-3లో తెలంగాణా యువకుడు

భారతదేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ సక్సెస్ లో మన తెలంగాణ యువకుడు భాగస్వామ్యం కావడం తెలుగువారికి, ముఖ్యంగా తెలంగాణ వారికి గర్వకారణం.

జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లికి చెందిన కృష్ణ కుమ్మరి చంద్రయాన్ 3 మిషన్ లో పేలోడ్స్ (ఏహెచ్ వీసీ), (ఐఎల్ఎస్ఏ) కి డేటా ప్రాసెసింగ్ సాప్ట్ వేర్ రాశారు. తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ కొడుకుని ఉన్నత చదువులు చదివించారు. కృష్ణ ప్రాథమిక విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ పాఠశాలలో కొనసాగింది. అనంతరం ఈ సెట్ రాసి హైదరాబాదులో కంప్యూటర్ సైన్స్ చదివాడు. ప్లేస్ మెంట్ లో ఉద్యోగం రావడంతో అక్కడ పని చేస్తూనే ఇస్రోలో ఐసీఆర్బీ రాసి ఆలిండియా స్థాయిలో 4వ ర్యాంకు తెచ్చుకున్నారు. అనంతరం 2018 జనవరిలో సైంటిస్ట్ లెవల్ ఉద్యోగం గ్రూస్ ఏ గెజిటెడ్ అధికారి, యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ ఇస్రోలో ఉద్యోగం సాధించారు.

చంద్రయాన్ లో కృష్ణకు అవకాశం.. ఈ ప్రాజెక్ట్ లో అనేక కేంద్రాలు పనిచేశాయి. మిషన్ లోని 2 పేలోడ్స్ లో ఐదుగురు సభ్యులు పని చేస్తే కృష్ణ డేటా ప్రాసెసింగ్ అనాలసిస్ సాప్ట్ వేర్ రాసినట్లు తెలిపారు. చంద్రయాన్ 3 మిషన్ కు 6 నెలల పాటు పని చేసినట్లు వివరించారు. ఈ ప్రాజెక్ట్ 100 శాతం విజయవంతం అవుతుందని ఆశిస్తున్నారు.

తనకు ఐదేళ్ల వయస్సులో పోలియో సోకి నరాలు చచ్చుబడ్డాయని తెలిపారు. దీనికి ఆయుర్వేద వైద్యంలో చికిత్స తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యుడు రామేశ్వర్ రెడ్డి వద్ద 10 సంవత్సరాల పాటు చికిత్స చేయించుకున్నానని ఆ తరువాతే తన పనులు తాను చేసుకునే వాడినని తెలిపారు. దాదాపు 23 ఏళ్ల పాటు ఆయుర్వేద మందులు వాడినట్లు చెప్పారు. తల్లిదండ్రులు జన్మనిస్తే, వైద్యుడు పునర్జన్మనిచ్చారని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story