TS Temples : తెలంగాణలో మళ్లీ సందడిగా ఆలయాలు..!

TS Temples : తెలంగాణలో మళ్లీ సందడిగా ఆలయాలు..!
TS Temples : తెలంగాణలోని ఆలయాలు మళ్లీ సందడిగా మారాయి. లాక్‌డౌన్‌ ఎత్తి వేయడంతో దర్శనాలకు వస్తున్నారు భక్తులు. దీంతో పలు ఆలయాలు కళకళలాడుతున్నాయి.

TS Temples : తెలంగాణలోని ఆలయాలు మళ్లీ సందడిగా మారాయి. లాక్‌డౌన్‌ ఎత్తి వేయడంతో దర్శనాలకు వస్తున్నారు భక్తులు. దీంతో పలు ఆలయాలు కళకళలాడుతున్నాయి. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దర్శనం కోసం బారులు తీరారు. ప్రతి ఒక్కరూ కోవిడ్‌ నిబంధనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు. నవ నారసింహస్వామి క్షేత్రాలలో ఒక్కటైన జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దర్శనాలు పునఃప్రారంభమయ్యాయి. దీంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. త్రివేణి సంగమ తీరాన పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకుంటున్నారు భక్తులు.

Tags

Read MoreRead Less
Next Story