TG: తెలంగాణలో అద్భుతమైన క్రీడాపాలసీ

TG: తెలంగాణలో అద్భుతమైన క్రీడాపాలసీ
X
తెలంగాణ క్రీడామంత్రి వాకిటి శ్రీహరి... గ్లోబల్ సమ్మిట్ లో మంత్రి ప్రసంగం.. ఆటనే దైవంగా భావించాలని సూచన... ప్రోత్సాహం అందిస్తామన్న అజారుద్దీన్

తె­లం­గాణ నుం­చి అనే­క­మం­ది క్రీ­డా­కా­రు­లు అం­త­ర్జా­తీయ స్థా­యి­కి వె­ళ్లా­ర­ని మం­త్రి అజా­రు­ద్దీ­న్ అన్నా­రు. గో­పీ­చం­ద్ అకా­డ­మీ నుం­చి అనేక మంది వచ్చా­ర­ని క్రీ­డా­భి­వృ­ద్ధి­లో మై­దా­నాల పా­త్ర చాలా కీ­ల­కం అన్నా­రు. ఫుట్ బాల్ ను కూడా రా­ష్ట్ర ప్ర­భు­త్వం ప్రో­త్స­హి­స్తోం­ద­ని చె­ప్పా­రు. ఇవాళ తె­లం­గాణ రై­జిం­గ్‌ గ్లో­బ­ల్‌ సమ్మి­ట్ రెం­డో రోజు కా­ర్య­క్ర­మా­ల్లో భా­గం­గా ‘ఒలిం­పి­క్‌ గో­ల్డ్‌ క్వె­స్ట్‌’ అం­శం­పై చర్చ ని­ర్వ­హిం­చా­రు. దీ­ని­లో మం­త్రి అజా­రు­ద్దీ­న్‌­తో పాటు క్రీ­డా ప్ర­ము­ఖు­లు అని­ల్‌ కుం­బ్లే, పు­ల్లెల గో­పీ­చం­ద్‌, పీవీ సిం­ధు, అం­బ­టి రా­యు­డు, గు­త్తా జ్వాల పా­ల్గొ­న్నా­రు. ఈ చర్చ­లో మా­ట్లా­డిన అజా­రు­ద్దీ­న్.. పీవీ సిం­ధు, సైనా నె­హ్వా­ల్, గు­త్తా జ్వాల మంచి పేరు తె­చ్చు­కు­న్నా­ర­ని క్రీ­డా­కా­రు­ల­కు ఆర్థిక సమ­స్య­లు లే­కుం­డా చూ­డా­ల్సిన అవ­స­రం ఉం­ద­న్నా­రు. క్రీ­డా­పా­ల­సీ­తో అనేక ఉప­యో­గా­లు ఉన్నా­య­ని క్రీ­డా­కా­రు­ల­కు ప్ర­భు­త్వం నుం­చి అం­డ­దం­డ­లు అవ­స­రం అన్నా­రు. క్రీ­డా­కా­రు­ల­కు ఆర్థిక సాయం, మంచి ఉద్యో­గం ఇవ్వా­ల­న్నా­రు.

ప్రోత్సాహం ఇస్తాం

‘‘క్రీ­డా­కా­రు­లూ.. మే­మం­తా మీ­పై­నే ఆశలు పె­ట్టు­కు­న్నాం. ఆటనే దై­వం­గా భా­విం­చి ఆడం­డి. ప్ర­పం­చం మీ వైపు చూ­స్తోం­ది’’ అని తె­లం­గాణ క్రీ­డా­శాఖ మం­త్రి వా­కి­టి శ్రీ­హ­రి అన్నా­రు. తె­లం­గాణ ప్ర­భు­త్వం అద్భు­త­మైన క్రీ­డా పా­ల­సీ తీ­సు­కు­వ­చ్చిం­ద­న్నా­రు. తె­లం­గాణ రై­జిం­గ్ గ్లో­బ­ల్ సమి­ట్ -2047లో ఒలిం­పి­క్ గో­ల్డ్ క్వె­స్ట్ ప్యా­నె­ల్ డి­స్క­ష­న్‌­లో వా­కి­టి శ్రీ­హ­రి, మం­త్రి అజా­రు­ద్దీ­న్‌­ల­తో పాటు, క్రీ­డా­కా­రు­లు పీవీ సిం­ధు, గు­త్తా జ్వాల, గో­పీ­చం­ద్, అం­బ­టి రా­యు­డు, అని­ల్‌ కుం­బ్లే పా­ల్గొ­న్నా­రు. క్రీ­డా­కా­రుల వి­జ­యా­ని­కి అనేక అం­శా­లు దో­హ­దం చే­స్తా­య­ని పీవీ సిం­ధు అన్నా­రు.

మౌ­లిక వస­తు­లు, కో­చ్‌­లు చాలా కీ­ల­క­మ­ని చె­ప్పా­రు. ప్ర­తి దశ­లో­నూ క్రీ­డా­కా­రు­ల­కు ప్రో­త్సా­హం అవ­స­ర­మ­న్నా­రు. మంత్రి మహమ్మద్‌ అజారుద్దీన్‌ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ నుంచి సైనా నెహ్వాల్, నిఖత్ జరీన్ వంటి అనేకమంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి వెళ్లారు. గోపీచంద్‌ అకాడమీ నుంచి అనేకమంది వచ్చారు. క్రీడాభివృద్ధిలో మైదానాల పాత్ర చాలా కీలకం. ఫుట్‌బాల్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

ప్రోత్సాహం అవసరం: పీవీ సింధు

ఈ చర్చ­లో పీవీ సిం­ధు మా­ట్లా­డు­తూ క్రీ­డా­కా­రుల వి­జ­యా­ని­కి అనేక అం­శా­లు దో­హ­దం చే­స్తా­య­ని పీవీ సిం­ధు అన్నా­రు. మౌ­లిక వస­తు­లు, కో­చ్‌­లు చాలా కీ­ల­క­మ­ని చె­ప్పా­రు. ప్ర­తి దశ­లో­నూ క్రీ­డా­కా­రు­ల­కు ప్రో­త్సా­హం అవ­స­ర­మ­న్నా­రు. సీఎం రే­వం­త్ రె­డ్డి క్రీ­డ­ల­కు ఎంతో మద్ద­తు­గా ని­లు­స్తు­న్నా­ర­ని రా­బో­యే సం­వ­త్స­రా­లు తె­లం­గాణ క్రీ­డా­కా­రు­ల­కు ఎంతో ఆశా­జ­న­కం­గా ఉం­డ­బో­తు­న్నా­య­న్నా­రు. పు­ల్లెల గో­పీ­చం­ద్‌ మా­ట్లా­డు­తూ హై­ద­రా­బా­ద్‌ దే­శం­లో­నే ఉత్తమ నగ­రా­ల­లో ఒక­ట­ని ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి వి­జ­న్ 2047 ని­జం­గా అద్భు­త­మై­న­ద­న్నా­రు.

Tags

Next Story