TG: ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ సమ్మిట్

TG: ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ సమ్మిట్
X
పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. 2047నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించడమే లక్ష్యంగా సమ్మిట్‌ నిర్వహించనున్నారు. మొత్తం 1,686 మంది ప్రతినిధులు, 42 దేశాల నుంచి 255 మంది అంతర్జాతీయ డెలిగేట్లు హాజరు కానున్నారు. అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు హైదరాబాద్‌ను కేంద్రంగా నిలపాలన్న ఉద్దేశంతో డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ గ్లోబల్ రైజింగ్‌ సమ్మిట్‌ను నిర్వహిస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంతర్జాతీయ పెట్టుబడిదారులు, ప్రముఖ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొంటున్న ఈ సమ్మిట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఫ్యూచర్‌ సిటీని ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా మారుస్తామంటోంది.


హై­ద­రా­బా­ద్‌­లో­ని భా­ర­త్‌ ఫ్యూ­చ­ర్‌ సి­టీ­లో ఈ నెల 8, 9 తే­దీ­ల్లో ని­ర్వ­హిం­చే ‘తె­లం­గాణ రై­జిం­గ్‌-2047 గ్లో­బ­ల్‌ సమి­ట్‌’కు రా­వా­ల్సిం­ది­గా ఆం­ధ్ర­ప్ర­దే­శ్, తమి­ళ­నా­డు, జమ్మూ­క­శ్మీ­ర్, ఝా­ర్ఖం­డ్, అస్సాం ము­ఖ్య­మం­త్రు­లు చం­ద్ర­బా­బు, స్టా­లి­న్, ఒమ­ర్‌ అబ్దు­ల్లా, హే­మం­త్‌ సో­రె­న్, బి­శ్వ­శ­ర్మ­ల­ను రా­ష్ట్ర ప్ర­భు­త్వం తర­ఫున ఉప­ము­ఖ్య­మం­త్రి భట్టి వి­క్ర­మా­ర్క, మం­త్రు­లు ఉత్త­మ్‌­కు­మా­ర్‌­రె­డ్డి, కో­మ­టి­రె­డ్డి వెం­క­ట్‌­రె­డ్డి, జూ­ప­ల్లి కృ­ష్ణా­రా­వు ఆహ్వా­నిం­చా­రు. శు­క్ర­వా­రం ఉదయం రాం­చీ వె­ళ్లిన ఉప ము­ఖ్య­మం­త్రి భట్టి వి­క్ర­మా­ర్క.. సీఎం హే­మం­త్‌ సో­రె­న్‌ ని­వా­సా­ని­కి వె­ళ్లి గ్లో­బ­ల్‌ సమి­ట్‌­కు రా­వా­ల­ని ప్ర­త్యే­కం­గా ఆహ్వా­నిం­చా­రు. 3 ట్రి­లి­య­న్‌ డా­ల­ర్ల ఆర్థిక వృ­ద్ధే లక్ష్యం­గా తె­లం­గాణ ప్ర­భు­త్వం ముం­దు­కు సా­గు­తోం­ద­ని భట్టి తె­లి­పా­రు. దీ­ని­కి అను­గు­ణం­గా అన్ని రం­గాల వృ­ద్ధి లక్ష్యా­లు, అను­స­రిం­చే భవి­ష్య­త్తు ప్ర­ణా­ళి­క­ల­ను వి­శ్లే­షిం­చే­లా తె­లం­గాణ రై­జిం­గ్‌-2047 వి­జ­న్‌ డా­క్యు­మెం­ట్‌­ను రూ­పొం­దిం­చి­న­ట్లు సీ­ఎం­కు వి­వ­రిం­చా­రు. మం­త్రి ఉత్త­మ్‌ శు­క్ర­వా­రం చె­న్నై వె­ళ్లి తమి­ళ­నా­డు సీఎం స్టా­లి­న్‌­ను కలి­సి సమి­ట్‌­కు రా­వా­ల­ని ఆహ్వాన పత్రి­క­ను అం­ద­జే­శా­రు.

తెలంగాణను ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 42 దేశాలకు చెందిన 1361 సంస్థలు సమ్మిట్‌లో పాల్గొననున్నాయి. ఈ సమ్మిట్‌తో రాబోయే రెండు దశాబ్దాల పాటు అభివృద్ధికి బలమైన పునాది పడనుంది.

Tags

Next Story