TG: మిగిలిన ఎమ్మెల్యేలకు ఊరట..?

TG: మిగిలిన ఎమ్మెల్యేలకు ఊరట..?
X
అయిదుగురు ఎమ్మెల్యేలకు భారీ ఊరట... అనర్హత పిటిషన్లు కొట్టేసిన తెలంగాణ స్పీకర్... బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆరోపణలు తోసివేత

ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక తీర్పు వెలువరించారు. ఐదుగురు ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి లపై అనర్హత పిటీషన్లను కొట్టివేస్తూ స్పీకర్ తీర్పును వెలువరించారు. ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా పార్టీ ఫిరాయించినట్లుగా ఎక్కడా ఆధారాలు లేవంటూ స్పీకర్ వారిపై అనర్హత వేటు వేయడానికి నిరాకరించారు. అయిదుగురు ఎమ్మెల్యేలపై బీఆర్ ఎస్ చేసిన ఫిరాయింపు అభియోగాలను త్రోసిపుచ్చారు. వారు పార్టీ ఫిరాయించినట్లుగా బీఆర్ఎస్ చేసిన వాదనతో స్పీకర్ ఏకీభవించలేదు. ఈ నెల 18వ తేదీ లోపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఏదో ఒక నిర్ణయాన్ని వెలువరించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ తన తీర్పును వెలువరించడం విశేషం.

వారికి కూడా త్వరలోనే ఊరట

స్పీకర్ తాజా నిర్ణయంతో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు భారీ ఊరట దక్కింది. అనర్హత వేటుకు నిరాకరణతో ఊరట పొందిన ఐదుగురు ఎమ్మెల్యేల తరహాలోనే మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, డాక్టర్‌ సంజయ్‌, పోచారం శ్రీనివాస్‌రెడ్డిలకు త్వరలో అనర్హత వేటు తప్పవచ్చని భావిస్తున్నారు. ఇకపోతే కడియం శ్రీహరి, దానం నాగేందర్ లు మాత్రం స్పీకర్ నోటీసులకు సమాధానం ఇవ్వడంలో మరింత సమయం అడిగిన నేపథ్యంలో వారిపై నిర్ణయం ఆసక్తికరంగా మారింది.

కడియం శ్రీహరి స్పష్టత

తాను ఇప్ప­టి­కీ భా­రాస సభ్యు­డి­గా కొ­న­సా­గు­తు­న్నా­న­ని, కాం­గ్రె­స్‌ పా­ర్టీ­లో చే­ర­లే­ద­ని ఎమ్మె­ల్యే కడి­యం శ్రీ­హ­రి తె­లి­పా­రు. భా­రాస తర­ఫున గె­లి­చి.. కాం­గ్రె­స్‌ పా­ర్టీ­లో చే­రా­ర­ని కడి­యం­పై భా­రాస ఎమ్మె­ల్యే కేపీ వి­వే­కా­నంద గతం­లో స్పీ­క­ర్‌­కు ఫి­ర్యా­దు చే­సిన సం­గ­తి తె­లి­సిం­దే. దీ­ని­పై వి­వ­రణ ఇవ్వా­ల­ని సభా­ప­తి గడ్డం ప్ర­సా­ద్‌­కు­మా­ర్‌ కా­ర్యా­ల­యం నుం­చి లేఖ వె­ళ్ల­గా.. కడి­యం తన వి­వ­ర­ణ­ను లి­ఖి­త­పూ­ర్వ­కం­గా సభా­ప­తి­కి అం­ద­జే­శా­రు. ‘‘నాపై అన­ర్హత వేటు వే­యా­లం­టూ భా­రాస చే­సిన ఫి­ర్యా­దు ని­రా­ధా­ర­మై­న­ది. నేను ఇప్ప­టి­కీ ఆ పా­ర్టీ సభ్యు­డి­గా­నే కొ­న­సా­గు­తు­న్నా. ప్ర­తి నెలా నా వే­త­నం నుం­చి రూ.5వేల చొ­ప్పున భా­రాస శా­స­న­స­భా పక్షం.. ఖర్చుల కోసం స్వీ­క­రి­స్తోం­ది. ఫి­రా­యిం­పు ని­రో­ధక చట్టం ని­బం­ధ­న­ల­ను నేను ఉల్లం­ఘిం­చ­లే­దు’’ అని కడి­యం పే­ర్కొ­న్నా­రు. దీ­ని­పై బీ­ఆ­ర్ఎ­స్ నే­త­లు తీ­వ్ర వి­మ­ర్శ­లు చే­స్తు­న్నా­రు.

Tags

Next Story