TG: తెలంగాణ రాజకీయాల్లో సంచలన మలుపు

TG: తెలంగాణ రాజకీయాల్లో సంచలన మలుపు
X
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫిరాయింపు స్పీకర్‌పై ఒత్తిడి... రాజీనామా దిశగా ఎమ్మెల్యేల చూపు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసి తమ సమాధానం ఇవ్వనున్నారు. ఈ మేరకు ఒకటి, రెండు రోజుల్లో స్పీకర్ ను కలిసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పై స్పీకర్ ఇప్పటికే విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. శనివారం నాటికి ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి కాగా, మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలు ఇప్పటి వరకు స్పీకర్ నోటీసులకు సమాధానం ఇవ్వలేదు. తమ వినతి మేరకు స్పీకర్ తమకు సమాధానమిచ్చేందుకు గడువు ఇచ్చినట్లూ చెబుతూ వచ్చారు. కానీ, సోమవారం సుప్రీం కోర్టు ఈ ఫిరాయింపుల వ్యవహారం పై స్పీకర్ కు జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్యేల్లో కదలిక వచ్చింది.

తె­లం­గాణ స్పీ­క­ర్‌­పై సు­ప్రీం­కో­ర్టు ఆగ్ర­హం వ్య­క్తం చే­సిం­ది. ఎమ్మె­ల్యేల అన­ర్హ­త­పై మీరు ని­ర్ణ­యం తీ­సు­కుం­టా­రా? మేము తీ­సు­కో­వా­లా ? అని సు­ప్రీం­కో­ర్టు తె­లం­గాణ స్పీ­క­ర్‌­ను ప్ర­శ్నిం­చిం­ది. ఎమ్మె­ల్యేల ఫి­రా­యిం­పు వ్య­వ­హా­రం­లో కో­ర్టు­ధి­క్కర పి­టి­ష­న్‌­పై తె­లం­గాణ స్పీ­క­ర్‌­కు సు­ప్రీం­కో­ర్టు నో­టీ­సు­లు జారీ చే­సిం­ది. ఫి­రా­యిం­పు ఎమ్మె­ల్యే­ల­పై మూడు నె­ల­ల్లో­గా ని­ర్ణ­యం తీ­సు­కో­క­పో­వ­డం­పై కే­టీ­ఆ­ర్ కో­ర్టు ధి­క్కార పి­టి­ష­న్ దా­ఖ­లు చే­సిన వి­ష­యం తె­లి­సిం­దే. ఈ నే­ప­థ్యం­లో కో­ర్టు­ధి­క్కా­రం­పై నా­లు­గు వా­రా­ల్లో­గా జవా­బు చె­ప్పా­ల­ని స్పీ­క­ర్‌­కి దేశ అత్యు­న్నత న్యా­య­స్థా­నం ఆదే­శా­లు జారీ చే­సిం­ది. ఈ పి­టి­ష­న్‌­ను సు­ప్రీం­కో­ర్టు ప్ర­ధాన న్యా­య­మూ­ర్తి జస్టి­స్ బి­ఆ­ర్. గవా­యి ధర్మా­స­నం వి­చా­రణ జరి­పిం­ది. “మూడు నె­ల­ల్లో­గా ని­ర్ణ­యం తీ­సు­కో­క­పో­వ­డం కో­ర్టు ధి­క్కా­ర­మే.. రో­జు­వా­రీ­గా వి­చా­రణ జరి­పి ని­ర్ణ­యం తీ­సు­కో­వా­లి..” అని జస్టి­స్ బీ­ఆ­ర్ గవా­యి స్ప­ష్టం చే­శా­రు. నా­లు­గు వా­రా­ల్లో­గా వి­చా­రణ పూ­ర్తి చే­స్తా­మ­ని స్పీ­క­ర్ తర­ఫున న్యా­య­వా­దు­లు అభి­షే­క్ సిం­గ్, ము­కు­ల్ రో­హ­త్గి వె­ల్ల­డిం­చా­రు. మూడు నె­ల­ల్లో­గా ని­ర్ణ­యం తీ­సు­కో­క­పో­వ­డం కో­ర్టు ధి­క్కా­ర­మే­న­ని జస్టి­స్ బీ­ఆ­ర్ గవా­యి ఈ సం­ద­ర్భం­గా వ్యా­ఖ్యా­నిం­చా­రు. 4 వా­రా­ల్లో­గా వి­చా­రణ పూ­ర్తి చే­స్తా­మ­ని స్పీ­క­ర్ తర­పున న్యా­య­వా­దు­లు అభి­షే­క్ సిం­గ్ , ము­కు­ల్ రో­హ­త్గి కో­ర్టు­కు చె­ప్పా­రు.

తె­లం­గా­ణ­లో పది­మం­ది ఎమ్మె­ల్యేల అన­ర్హత అం­శా­ని­కి సం­బం­ధిం­చి దా­ఖ­లైన మూడు వే­ర్వే­రు పి­టి­ష­న్లు సో­మ­వా­రం సు­ప్రీం­కో­ర్టు ప్ర­ధాన న్యా­య­మూ­ర్తి జస్టి­స్‌ బీ­ఆ­ర్‌ గవా­య్‌ ధర్మా­స­నం ముం­దు­కు వి­చా­ర­ణ­కు వచ్చా­యి. ఆ ఎమ్మె­ల్యే­ల­కు వ్య­తి­రే­కం­గా భారత రా­ష్ట్ర సమి­తి దా­ఖ­లు చే­సిన పి­టి­ష­న్ల­పై మూ­డు­నె­ల­ల్లో­పు ని­ర్ణ­యం తీ­సు­కో­వా­ల­ని జులై 31న జస్టి­స్‌ బీ­ఆ­ర్‌ గవా­య్‌ నే­తృ­త్వం­లో­ని ధర్మా­స­నం ఆదే­శిం­చిం­ది. అయి­తే వి­భి­న్న కా­ర­ణా­ల­వ­ల్ల ఆలో­పు ని­ర్ణ­యం తీ­సు­కో­వ­డం సా­ధ్యం కా­నం­దున స్పీ­క­ర్‌­కు మరో రెం­డు­నె­ల­లు గడు­వు ఇవ్వా­ల­ని కో­రు­తూ తె­లం­గాణ శా­స­న­సభ కా­ర్య­ద­ర్శి దా­ఖ­లు చే­సిన మి­సి­లే­ని­య­స్‌ అప్లి­కే­ష­న్‌ సీ­జేఐ ధర్మా­స­నం ముం­దు 14వ నం­బ­రు­లో లి­స్ట్‌ అయిం­ది.

తమ పా­ర్టీ­లో గె­లి­చిన 10 మంది ఎమ్మె­ల్యే­లు పా­ర్టీ మా­రా­ర­ని బీ­ఆ­ర్ఎ­స్ ఫి­ర్యా­దు చే­సిన వి­ష­యం తె­లి­సిం­దే. సు­ప్రీం కో­ర్టు 3 నె­ల­ల్లో ఎమ్మె­ల్యే­ల­పై చర్య­లు తీ­సు­కో­వా­ల­ని ఆదే­శా­లు ఇచ్చి­న­ప్ప­టి­కీ స్పీ­క­ర్ ఎటు­వం­టి చర్య­లు తీ­సు­కో­లే­ద­ని బీ­ఆ­ర్ఎ­స్ తరఫు న్యా­య­వా­ది వా­దిం­చ­ను­న్నా­రు. తె­లం­గాణ అసెం­బ్లీ స్పీ­క­ర్‌­పై కే­టీ­ఆ­ర్ కో­ర్టు­ధి­క్కార పి­టి­ష­న్ దా­ఖ­లు చే­శా­రు.

Tags

Next Story