స్కూటీపై వచ్చి లారీని అడ్డగించి.. గొల్లూరులో దొంగల బీభత్సం

X
By - Prasanna |18 Dec 2023 1:05 PM IST
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గొల్లూరులో దొంగలు బీభత్సం సృష్టించారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గొల్లూరులో దొంగలు బీభత్సం సృష్టించారు. స్కూటీపై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని దొంగలు లారీని ఆపి కత్తులతో బెదిరించి రూ.15000 నగదు దోచుకెళ్లారు. ఈ ఘటన శంషాబాద్ మండలం గొల్లూరు ఎక్స్ రోడ్డు వద్ద చోటుచేసుకుంది.
వనపర్తి నుంచి హైదరాబాద్ వస్తున్న లారీని గొల్లూరు ఎక్స్ రోడ్డు వద్ద అడ్డగించిన దుండగులు కత్తులతో బెదిరించి నగదు దోచుకెళ్లారు. లారీ డ్రైవర్ రమేష్, రాములు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com