కాంగ్రెస్ హయాంలోనే వారికి మేలు జరిగింది- రేవంత్ రెడ్డి

X
By - Gunnesh UV |14 Aug 2021 4:45 PM IST
Revanth Reddy: యువత ఆత్మహత్యలు చూడలేకనే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.
Revanth Reddy: యువత ఆత్మహత్యలు చూడలేకనే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. దేశానికి స్వాతంత్ర్యం తేవడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాలు చేసిందన్నారు. కాంగ్రెస్ మైనార్టీ గర్జన సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి... కాంగ్రెస్ హయాంలోనే మైనార్టీలకు మేలు జరిగిందన్నారు. వైఎస్సార్ నేతృత్వంలో రిజర్వేషన్ కల్పిస్తే ఎంతోమంది మైనార్టీలకు అవకాశాలు లభించాయన్నారు. రాష్ట్రపతి, ముఖ్యమంత్రి పదవులు ముస్లీంలకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే అని... కారును, పతంగిని నమ్ముకొని మైనార్టీలు మోసపోవద్దన్నారు. కార్ స్ట్రీరింగ్ తన చేతిలో ఉందని చెప్పుకునే అసద్.. త్రిబుల్ తలాక్ కు అనుకూలంగా రంజిత్ రెడ్డి ఎలా ఓటు వేశారని ప్రశ్నించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com