ఆ ఇద్దరు నాటకాలాడుతున్నారు : టీపీసీసీ చీఫ్ ఉత్తమ్

కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆధరణ చూసి భయపడి మంత్రి హరీష్ రావు, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు నాటకాలాడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హరీష్ రావు, రఘునందన్ రావులు ఇద్దరూ అన్నదమ్ములని... కావాలనే ఉప ఎన్నికల్లో ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం నిర్వహించారు.
దుబ్బాక మండలం శివాజీనగర్, గంభీర్ పూర్, పోతారం, ఆరెపల్లి గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. తమ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. తమ నియోజకవర్గంలో ఎలాంటి పనులు కావట్లేదని స్వయంగా రామలింగారెడ్డి అసెంబ్లిలో చెప్పారన్నారు. పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామలింగారెడ్డికే పనులు కానప్పుడు... ఆయన సతీమణితో అభివృద్ధి ఎలా సాధ్యమని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com