TPCC: మంత్రుల గొడవ.. ముగిసిన అధ్యాయం

TPCC: మంత్రుల గొడవ.. ముగిసిన అధ్యాయం
X
టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్ కీలక వ్యాఖ్యలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమని, మంచి మెజారిటీ సాధిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని మహేష్ గౌడ్ తెలిపారు. “మా ప్రభుత్వం జూబ్లీహిల్స్‌లో 46 వేల ఇళ్లకు సంక్షేమ పథకాలు అందిస్తోంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువవుతున్నాయి. ఇది మా బలం,” అని ఆయన పేర్కొన్నారు. గత దశాబ్దంగా ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుస్తున్నప్పటికీ, ఓటు చోరీ ఆరోపణలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి పోరాడుతున్నారని ఆయన గుర్తు చేశారు.

అది ముగిసిన అధ్యాయం

రా­ష్ట్రం­లో­ని అన్ని పరి­స్థి­తు­ల­ను కాం­గ్రె­స్ హై­క­మాం­డ్ దృ­ష్టి­లో ఉం­చు­కుం­ద­ని, అం­ద­రూ దాని రా­డా­ర్‌­లో ఉన్నా­ర­ని మహే­ష్ గౌడ్ స్ప­ష్టం చే­శా­రు. “మం­త్రుల మధ్య గొ­డ­వ­లు ము­గి­సిన అధ్యా­యం. ఎవ­రై­నా జా­గ్ర­త్త­గా మా­ట్లా­డా­లి. ఎంత ఎది­గి­నా ఒది­గి ఉం­డా­లి,” అని ఆయన సూ­చిం­చా­రు. కొం­డా సు­రేఖ, కడి­యం శ్రీ­హ­రి మధ్య ఇటీ­వల జరి­గిన వి­వా­దం­పై మా­ట్లా­డు­తూ, “కొం­ద­రు అలా మా­ట్లా­డ­కూ­డ­దు. పో­లీ­సుల వల్ల కొంత గం­ద­ర­గో­ళం జరి­గిం­ది, అది కమ్యూ­ని­కే­ష­న్ గ్యా­ప్ మా­త్ర­మే,” అని వి­వ­రిం­చా­రు. ఈ సమ­స్య­ల­పై హై­క­మాం­డ్‌­కు రి­పో­ర్ట్ సమ­ర్పిం­చా­మ­ని తె­లి­పా­రు. కొం­త­మం­ది ఎమ్మె­ల్యే­ల­కు డీ­సీ­సీ బా­ధ్య­త­లు అప్ప­గిం­చే అవ­కా­శం ఉం­ద­ని మహే­ష్ గౌడ్ వె­ల్ల­డిం­చా­రు. ఉత్త­మ్ సతీ­మ­ణి డీ­సీ­సీ అధ్య­క్ష పద­వి­కి దర­ఖా­స్తు చే­సి­న­ట్లు సమా­చా­రం ఉం­ద­ని పే­ర్కొ­న్నా­రు.

"ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకిల మోత"

కాం­గ్రె­స్‌­ది ఇం­ట్లో ఈగల మోతా.. బయట పల్ల­కిల మోతా అని హరీ­శ్‌­రా­వు ఎద్దే­వా చే­శా­రు. పం­ప­కా­ల్లో తేడా వచ్చి మం­త్రు­లు, ము­ఖ్య­మం­త్రి తన్ను­కుం­టు­న్నా­ర­ని అన్నా­రు. మొ­న్న కొం­డా సు­రేఖ బి­డ్డ, ని­న్న జూ­ప­ల్లి కృ­ష్ణా­రా­వు ఎలా మా­ట్లా­డా­రో చూ­శా­రు కదా అని తె­లి­పా­రు. క్యా­బి­నె­ట్ మీ­టిం­గ్‌­లో ము­ఖ్య­మం­త్రి, మం­త్రు­లు బట్ట­లూ­డ­దీ­సు­కొ­ని తి­ట్టు­కు­న్నా­రట అని పే­ర్కొ­న్నా­రు. కాం­గ్రె­స్ ప్ర­జల గు­రిం­చి చూ­డ­టం లే­ద­ని.. వా­ళ్లు తన్ను­కో­డా­ని­కి, వా­టా­లు పం­చు­కో­వ­డా­ని­కి సరి­పో­తుం­ద­ని వి­మ­ర్శిం­చా­రు. మల్లా కే­సీ­ఆ­ర్ వస్తే­నే ప్ర­జ­ల­కు మేలు జరు­గు­తుం­ద­ని అన్నా­రు. అం­ద­రి­లా­గా పైకి రా­వా­లి.. మేలు జర­గా­ల­ని మీరు కో­రు­కుం­టు­న్నా­ర­ని వడ్డెర కు­ల­స్తు­ల­ను ఉద్దే­శిం­చి అన్నా­రు. ని­జా­ని­కి కే­సీ­ఆ­ర్ ప్ర­భు­త్వం వడ్డెర సమా­జా­ని­కి సహా­యం చే­సిం­ద­ని తె­లి­పా­రు. సి­ద్ది­పే­ట­లో ట్రా­క్ట­ర్లు అం­దిం­చా­మ­ని పే­ర్కొ­న్నా­రు.

బీఆర్ఎస్‌కు ఓటేయండి: కేటీఆర్

పదే­ళ్ల బీ­ఆ­ర్‌­ఎ­స్‌ ప్ర­గ­తి పా­ల­న­ను, గత రెం­డే­ళ్ల కాం­గ్రె­స్ మో­సాల పా­ల­న­ను బే­రీ­జు వే­సు­కొ­ని జూ­బ్లీ­హి­ల్స్ ఉప ఎన్ని­క­లో ప్ర­జ­లు తమ ఓటు హక్కు­ను వి­ని­యో­గిం­చు­కో­వా­ల­ని బీ­ఆ­ర్‌­ఎ­స్ వర్కిం­గ్ ప్రె­సి­డెం­ట్ కే­టీ­ఆ­ర్ వి­జ్ఞ­ప్తి చే­శా­రు. తె­లం­గా­ణ­లో అన్ని వర్గాల ప్ర­జ­ల­ను కాం­గ్రె­స్ ప్ర­భు­త్వం మోసం చే­సిం­ద­ని, బు­ల్డో­జ­ర్ పాలన నడు­స్తోం­ద­ని ఆయన తీ­వ్రం­గా వి­మ­ర్శిం­చా­రు. మై­నా­ర్టీ ప్రా­తి­ని­ధ్యం లేని తొలి కాం­గ్రె­స్ ప్ర­భు­త్వం తె­లం­గా­ణ­లో­నే ఏర్ప­డిం­ద­ని కే­టీ­ఆ­ర్ అన్నా­రు. ఆరు­గు­రు ఎమ్మె­ల్సీ­ల­కు అవ­కా­శం ఉన్న­ప్ప­టి­కీ, కాం­గ్రె­స్ పా­ర్టీ ఒక్క మై­నా­ర్టీ­కి కూడా అవ­కా­శం ఇవ్వ­లే­దు. ఈ వి­ష­యా­ల­పై రా­హు­ల్ గాం­ధీ సమా­ధా­నం చె­ప్పా­ల­ని ఆయన డి­మాం­డ్ చే­శా­రు. జూ­బ్లీ­హి­ల్స్ ని­యో­జ­క­వ­ర్గం­లో­ని షే­క్‌­పేట డి­వి­జ­న్ రి­ల­య­న్స్ జూ­బ్లీ­కే­టె­డ్ కమ్యూ­ని­టీ­లో ఏర్పా­టు­చే­సిన సమా­వే­శం­లో బీ­ఆ­ర్ఎ­స్ వర్కిం­గ్ ప్రె­సి­డెం­ట్ కే­టీ­ఆ­ర్ పా­ల్గొ­న్నా­రు.

Tags

Next Story