విషాదం: 24 ఏళ్ల టెక్కీ.. క్రికెట్ ఆడుతూ కుప్పకూలి..

X
By - Prasanna |4 March 2024 3:46 PM IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లాకు చెందిన కసిరెడ్డి సంజయ్ భార్గవ్ ఆరు నెలలుగా హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లాకు చెందిన కసిరెడ్డి సంజయ్ భార్గవ్ ఆరు నెలలుగా హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ గచ్చిబౌలి సమీపంలోని గౌలిదొడ్డిలో నివాసం ఉంటున్నాడు.
మహేశ్వరం సమీపంలో శనివారం సాయంత్రం క్రికెట్ ఆడుతూ 24 ఏళ్ల టెక్కీ కుప్పకూలి మృతి చెందాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భార్గవ్ తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు గట్టుపల్లిలోని కేసీఆర్ స్టేడియంకు వెళ్లాడు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మైదానంలో స్పృహ కోల్పోయి కుప్పకూలిపోయాడు. అతని స్నేహితులు అతనిని ఆసుపత్రికి తరలించారు. అక్కడికి చేరుకునేలోపే వైద్యులు అతడు మృతి చెందినట్లు ప్రకటించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com