TS: రాష్ట్ర సర్కారు తీరుపై అక్బరుద్దీన్ ఫైర్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్గా జరుగుతున్నాయి. సర్కార్ తీరుపై మజ్లిస్ శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. పాతబస్తీలో అభివృద్ధి పనులు జరగడం లేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్ సభలో లేకపోవడాన్ని ప్రస్తావించారు. టీవీ డిబెట్లో కూర్చోవడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు టైమ్ ఉంది కానీ.. ప్రజాసమస్యలపై చర్చించేందుకు టైమ్ లేదా అని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. 25ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఇలాంటి అసెంబ్లీ చూడలేదని అక్బరుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు అందుబాటులో ఉండడం లేదన్న అక్బరుద్దీన్.. ప్రజాసమస్యలపై ఎవర్ని అడగాలని నిలదీశారు.
అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ తప్పుపట్టారు. బీఏసీ సమావేశానికి రాకుండా.. ఇప్పుడు గొంతు చించుకుంటే ఏం లాభమంటూ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్కు అక్బరుద్దీన్ ఓవైసీకి పోలిక కరెక్ట్ కాదన్న కేటీఆర్.. సభా నాయకుడు రాకపోతే మజ్లిస్కు ఏం సంబంధం అని ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com