TS : శ్రీలింగమంతుల స్వామి జాతరకు ఏర్పాట్లు పూర్తి

TS : శ్రీలింగమంతుల స్వామి జాతరకు ఏర్పాట్లు పూర్తి
X
పెద్ద గట్టు జాతరకు 'లింగో.. ఓలింగో' అంటూ కత్తులు తిప్పుతూ.. కటారులు చేతబూని.. డప్పు వాయిద్యాల మధ్య స్వామివారిని దర్శించుకుంటారు


తెలంగాణలో రెండో అతి పెద్ద జాతర శ్రీలింగమంతుల స్వామి జాతర. సూర్యాపేట జిల్లా దురాజ్‌ పల్లి గ్రామంలోని పెద్దగట్టుపైనే ప్రతి రెండేళ్లకోసారి వైభవంగా జరుగుతుంటుంది. రేపటి నుండి ఈ నెల 10 వరకు అంగరంగ వైభవంగా జాతర నిర్వహిస్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు తరలివస్తుంటారు. పెద్ద గట్టు జాతరకు 'లింగో.. ఓలింగో' అంటూ కత్తులు తిప్పుతూ.. కటారులు చేతబూని.. డప్పు వాయిద్యాల మధ్య స్వామివారిని దర్శించుకుంటారు.


జాతర మొదటి రోజు.. తల్లిగొర్రె-పిల్లగొర్రెలను జంటగా బలిస్తారు. ఈ కార్యక్రమాన్నే బలిపూజ అంటారు. మూలవిరాట్‌ ఉత్స వమూర్తులకు అలంకరణతోపాటు యాదవ పూజారాలు చౌడమ్మ తల్లిచెంతకు తీసుకొచ్చి గుట్టపై ప్రతిష్టిస్తారు. అనంతరం బోనాల గంపలతో భారీ ప్రదర్శన నిర్వహిస్తారు. మరోవైపు దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసుల్ని నడుపుతుంది. సూర్యాపేట బస్‌ స్టేషన్ నుండి ప్రతీరోజు వంద అదనపు బస్సులను ఏర్పాటు చేసింది. భక్తుల రాక దృష్ట్యా అధికారులు అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు.

ఐదు రోజులపాటు కన్నుల పండువగా జరిగే ఈ జాతర పుష్యమాస అమావాస్య రోజున గంపల ప్రదర్శనతో మొదలవుతోం ది. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి 24న దిష్టిపూజ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. మంత్రి జగదీష్ రెడ్డి డబ్బు వాయిద్యా లతో జాతరకు అంకురార్పణ కార్యక్రమాన్ని చేశారు.


Tags

Next Story