TS : "రాజశేఖర్రెడ్డి పగబట్టడం వల్లే ఇక్కడికి వచ్చా"

X
By - Vijayanand |5 Feb 2023 3:49 PM IST
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి పగబట్టడం వల్లే తాను పాలకుర్తికు వచ్చినట్లు తెలిపారు
బీఆర్ఎస్ నాయకులు, రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి పగబట్టడం వల్లే తాను పాలకుర్తికు వచ్చినట్లు తెలిపారు. ఎంపీగా గెలిచిన తర్వాత కాంగ్రెస్లోకి రావాలంటూ, అప్పటి సీఎం వైఎస్ఆర్ బెదిరించారన్నారు.
తాను కాంగ్రెస్లోకి రానని స్పష్టంగా చెప్పడంతో, పాలిటిక్స్లో రాకుండా చేస్తానని వార్నింగ్ ఇచ్చారన్నారు ఎర్రబెల్లి. అంతేకాదు తనపై పగబట్టి రెండు ఎంపీ స్థానాలతో పాటు వర్దన్నపేట ఎమ్మెల్యే స్థానాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేశారన్నారు. అందుకే పాలకుర్తికి వచ్చానని, ఇక్కడి ప్రజలు గొప్పగా ఆదరించి రెండుసార్లు గెలిపించారన్నారు. మూడోసారి దంచేసి గెలిపించారన్నారు ఎర్రబెల్లి దయాకర్రావు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com