TS : బేగంపేట అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి తలసాని

TS : బేగంపేట అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి తలసాని
పనులు వేగంగా జరగకపోవడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సివరేజ్‌, వాటర్‌ పైప్‌లైన్‌ పనులు కూడా వెంటనే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు

హైదరాబాద్‌ బేగంపేట నాలా అభివృద్ధి పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. 45 కోట్ల రూపాయలతో SNDP కార్యక్రమం కింద ఈ పనులు కొనసాగుతున్నాయి. అయితే పనులు వేగంగా జరగకపోవడంతో అధికారుల తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలా పరిసర కాలనీల్లోని సివరేజ్‌, వాటర్‌ పైప్‌లైన్‌ పనులు కూడా వెంటనే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ చివరి నాటికి బేగంపేట నాలా పనులు పూర్తవుతాయన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

GHMC లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు మంత్రి తలసాని. కుక్కల దాడిలో మరణించిన చిన్నారి విషయంపై ఆయన స్పందించారు. కుక్కల దాడిలో చిన్నారి చనిపోవడం బాధాకరమని తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటన జరుగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే నగరంలో చాలా కుక్కలను జీహెచ్ఎమ్సీ సిబ్బంది పట్టుకున్నారని అన్నారు.

Tags

Next Story