TS: మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడి
తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ఈ సందర్భంగా ప్రగతి భవన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం కనిపించింది.. రాష్ట్రంలో పెరుగుతున్న నేరాలు, మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలపై మహిళా కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావ్ నేతృత్వంలో మహిళా నేతలంతా ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు.. ప్రీతి మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ నినాదాలు చేశారు.. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. 30 మంది మహిళా కాంగ్రెస్ కార్యకర్తల్ని పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com