TS: ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ తలవంచదు: ఎమ్మెల్సీ కవిత

TS: ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ తలవంచదు: ఎమ్మెల్సీ కవిత
చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా తాను దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తా

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో... ఈడీ నోటీలివ్వడంపై.. స్పందించారు ఎమ్మెల్సీ కవిత. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ తలవంచదన్నారు. రాజకీయ రంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్నది తమ డిమాండ్ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతి ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షను తలపెట్టిందన్నారు. ఈ క్రమంలోనే మార్చి 9న ఢిల్లీలో విచారణకు రావాల్సిందిగా ఈడి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.

చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా తాను దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని కానీ ధర్నా, ముందస్తు అపాయింట్మెంట్ల రీత్యా విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటానన్నారు. ఇలాంటి చర్యలతో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని లొంగ తీసుకోవడం కుదరదని బీజేపి తెలుసుకోవాలన్నారు కవిత. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీజేపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగాడుతూనే ఉంటామని, దేశ అభ్యున్నతి కోసం గొంతెత్తుతామన్నారు కవిత. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచబోదని గుర్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాటం చేస్తామన్నారు ఎమ్మెల్సీ కవిత.

Tags

Read MoreRead Less
Next Story