TS : హైదరాబాద్‌లో మరోసారి ఈడీ తనిఖీలు

TS : హైదరాబాద్‌లో మరోసారి ఈడీ తనిఖీలు
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, పటాన్ చెరు సహా 15 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడీ ఈ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తుంది

హైదరాబాద్‌లో మరోసారి ఈడీ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. తెల్లవారుజాము నుంచి నగరంలోని ఓ ప్రముఖ ఫార్మా కంపెనీ ఎండీ శ్రీధర్‌రావు ఇంటితో పాటు ఆ కంపెనీ డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, పటాన్ చెరు సహా 15 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడీ ఈ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సోదాలు ఎందుకు చేస్తున్నారనే విషయం ఇంకా తెలియరాలేదు. హైదరాబాద్‌లో ప్రతీ నెలలో ఐటీ, ఈడీ సోదాలు జరుగుతుండడం కలకలం రేపుతోంది. గతంలో కూడా నగరంలోని ప్రముఖ కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేయగా.. ఇప్పుడు మరోసారి ఫార్మా కంపెనీలో తనిఖీలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story