TS : సిద్దిపేట అదనపు కలెక్టర్ పై కుక్కల దాడి..!

సిద్దిపేట కలెక్టరేట్ క్వార్టర్స్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. క్వార్టర్స్ ఆవరణలో వాకింగ్ చేస్తున్న డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డిని కుక్క కరిచింది. కుక్కల దాడిలో డిప్యూటీ కలెక్టర్ తీవ్రంగా పడ్డారు. ప్రస్తుతం ఆయన... సిద్దిపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
శనివారం రాత్రి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డితోపాటు మరో ఇద్దరిని కుక్కలు కరిచాయి. ఆయన రెండు మోకాళ్ల పిక్కల భాగంలో కరవడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే ఆయన్ని సిద్దపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అదేరాత్రి మరో వీధిలో ఇంకో వ్యక్తిని కలెక్టర్ పెంపుడు శునకం కరిచింది. కుక్కలు చెలరేగడంతో క్వాటర్స్ లోని అధికారుల కుటుంబాలు భయపడుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే కుక్కలు స్వైరవిహారం చేస్తూ ప్రజలను కరుస్తున్నా పట్టించుకునేవారే లేరు. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా కుక్కలకు ప్రజలు బలవుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com