TS : వైద్య, ఆరోగ్య రంగాలపై అధిక ప్రాధాన్యత : మంత్రి కేటీఆర్

X
By - Vijayanand |7 April 2023 3:49 PM IST
గ్రామీణ ప్రాంతాల నుంచి కంటి సమస్యలు ఉన్నవారిని దవాఖానకు తీసుకొచ్చి సేవలు అందించాలనుకోవడం గొప్ప విషయమన్నారు
వైద్య, ఆరోగ్య రంగానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశామని తెలిపారు. హైదరాబాద్ నార్సింగిలో 225 పడకలతో కొత్తగా ఏర్పాటు చేసిన శంకర ఐ హాస్పిటల్ను ప్రారంభించిన కేటీఆర్... పల్లె, బస్తీ దవాఖానలతో పేదల వద్దకే అత్యాధునిక వైద్య సేవలు తీసుకెళ్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా శంకర నేత్రాలయ వైద్య సేవలను ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కంటి సమస్యలు ఉన్నవారిని దవాఖానకు తీసుకొచ్చి సేవలు అందించాలనుకోవడం గొప్ప విషయమన్నారు. ఇక శంకర నేత్రాలయ వాహనాలకు లైఫ్, రిజిస్ట్రేషన్ చార్జీల నుంచి మినహాయింపునిస్తున్నామని చెప్పారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com