TS : సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్

X
By - Vijayanand |8 April 2023 5:03 PM IST
రాష్ట్రానికి కేంద్రం 11 వేల 360 కోట్ల ఇస్తే.. తెలంగాణకు బీజేపీ ఏంఇవ్వడం లేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు
ప్రధాని మోదీ సభకు సీఎం కేసీఆర్ రాకపోవడంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. కేసీఆర్ కార్యక్రమాల షెడ్యూల్ బయటపెట్టాలన్నారు. రాష్ట్రానికి కేంద్రం 11 వేల 360 కోట్ల ఇస్తే.. తెలంగాణకు బీజేపీ ఏంఇవ్వడం లేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు, అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల అభ్యన్నతి కోసమే బీజేపీ పోరాటం చేస్తోందని తెలిపారు. రాబోయే రోజుల్లో బీజేపీకి ప్రజలు మద్దతు పలకాలని.. అభివృద్ధి ఏంటో చూపిస్తామని బండి సంజయ్ స్పష్టంచేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com