TS : యాసంగిలో 54 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశాం : మంత్రి హరీష్
By - Vijayanand |5 March 2023 8:31 AM GMT
తెలంగాణలో ఈ యాసంగిలో 54 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారన్నారు మంత్రి హరీష్. కానీ.. ఏపీలో మాత్రం కేవలం 16 లక్షల ఎకరాల్లోనే వరి సాగైందన్నారు. సిద్ధిపేట రూరల్ మండలం చిన్నగుండవెల్లి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి హరీష్ పాల్గొన్నారు. తెలంగాణలో ప్రస్తుతం రైతు రాజ్యం నడుస్తోందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఏమి విమర్శించాలో విపక్షాలకు అర్థం కావడం లేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి జరగడం లేదన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com