TS : ఈడీ నోటీసులు వస్తాయని కవితకు ముందే తెలుసా : డీకే అరుణ
By - Vijayanand |8 March 2023 8:17 AM GMT
కల్వకుంట్ల కుటుంబంలో ఎవరిపై ఆరోపణలు వచ్చినా.. తెలంగాణ సమాజంపై వచ్చినట్లు చిత్రీకరించడం సబబు కాదన్నారు డీకే అరుణ
ఈడీ నోటీసులు వస్తాయని కవితకు ముందే తెలుసా అని ప్రశ్నించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. అందుకే మహిళారిజర్వేషన్లపై ధర్నా అంటూ కొత్త రాగం అందుకున్నారా అంటూ ఎద్దేవా చేశారామె. దర్యాప్తు సంస్థలు వాటిపని అవి చేసతాయని, ఇందులో బీజేపీకి ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. కక్ష సాధింపు చర్యలకు మీరు పాల్పడతారని, అందరూ మీలాగే ఉంటారని అనుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో దర్యాప్తు సంస్థలు నమోదు చేసిన కేసులన్నీ కక్ష సాధింపులేననా అన్నారు. కల్వకుంట్ల కుటుంబంలో ఎవరిపై ఆరోపణలు వచ్చినా.. తెలంగాణ సమాజంపై వచ్చినట్లు చిత్రీకరించడం సబబు కాదన్నారు డీకే అరుణ.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com