TS : లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత.. షర్మిల హౌజ్ అరెస్ట్

TS : లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత..  షర్మిల హౌజ్ అరెస్ట్
ఉస్మానియా ఆసుపత్రిలో రేకుల షెడ్డులో వైద్యం చేస్తున్నారని ఆరోపించారు

హైదరాబాద్ లోని లోటస్ పాండ్ వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఉస్మానియా ఆసుపత్రికి బయలుదేరిన YSRTP చీఫ్ షర్మిలను పోలీసులు గేటు దగ్గరే అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, షర్మిలకు మధ్య వాగ్వాదం జరిగింది. కనీసం తనను ఒక్కదాన్నైనా వెళ్ళనివ్వండని పోలీసులను కోరారు. తాను కేవలం ఉస్మానియాలో ఉన్న రోగులను మాత్రమే పరమర్శిస్తానని స్పష్టం చేశారు. వెళ్ళనివ్వద్దని పై అధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయని పోలీసులు వివరించారు.దీంతో ఆమె రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు.


ఉస్మానియా ఆసుపత్రిలో రేకుల షెడ్డులో వైద్యం చేస్తున్నారని ఆరోపించారు. 200కోట్లు పెట్టి ఉస్మానియా హెల్త్ టవర్స్ కడతామని సీఎం కేసీఆర్ గాలి మాటలు చెప్పారని విమర్శించారు. తనను హౌజ్ అరెస్టు చేయడంపైనా ఆమె నిప్పులు చెరిగారు. మీకు ఏం అధికారం ఉందని హౌజ్ అరెస్టు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఅర్ నియంత అని మరో సారి నిరూపణ అయ్యిందని, వైఎస్సార్ బిడ్డకు కేసీఆర్ భయపడుతున్నాడని కామెంట్స్ చేశారు. అందుకే తనను ఆపుతున్నారని, ఇచ్చిన ఒక్క వాగ్ధానాన్నీ నిలబెట్టుకోలేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే జనతా రైడ్ కి పిలుపునిచ్చామన్నారు షర్మిల.

Tags

Read MoreRead Less
Next Story