TS : ఉరితీసినా తప్పు లేదు : రేవంత్ రెడ్డి

X
By - Vijayanand |31 March 2023 4:27 PM IST
రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను.. అమరవీరుల స్థూపం ముందు ఉరితీసినా తప్పు లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి. ఈడీ కార్యాలయానికి వచ్చిన ఆయన.. ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం వల్ల.. 2వేల మంది విద్యార్థులు చనిపోయారని.. వందలాది మంది విద్యార్థులు చనిపోయినా.. కల్వకుంట్ల కుటుంబానికి చీమకుట్టినట్లైనా లేదని భగ్గుమన్నారు. TSPSC పేపర్ లీక్కు బాధ్యులైన వారిని శిక్షిస్తారని అనుకున్నామని.. పేపర్ లీక్పై ప్రశ్నించిన వాళ్లకు సిట్ నోటీసులివ్వడమేంటని ప్రశ్నించారు. TSPSC ఛైర్మన్, సెక్రటరీకి తెలియకుండా.. కంప్యూటర్లలోని డేటా బయటకు వచ్చే అవకాశం లేదన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com