TSPSC: గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల

TSPSC: గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల
X
ఆర్డీవో పోస్టులకు ఎంపికైన టాప్‌-10 ర్యాంకర్లు

తెలంగాణ రాష్ట్రంలో 562 గ్రూప్‌-1 సర్వీసుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను బుధవారం అర్ధరాత్రి టీజీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్య క్రమం, ప్రధాన పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్, రిజర్వేషన్, రోస్టర్‌ ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపికైన వారి వివరాలు వెల్లడించింది. మొత్తం 563 పోస్టుల్లో 562 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు టీజీపీఎస్సీ ఛైర్మన్‌ బుర్రా వెంకటేశం తెలిపారు. మరో ఒక పోస్టును న్యాయవివాదం నేపథ్యంలో విత్‌హెల్డ్‌లో పెట్టినట్లు పేర్కొన్నారు. గ్రూప్‌-1లో టాప్‌-10 ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఆర్డీవో పోస్టులు ఎంపిక చేసుకున్నారని చెప్పారు. టాప్‌-10 ర్యాంకులను వరుసగా లక్ష్మీదీపిక, దాడి వెంకటరమణ, వంశీకృష్ణారెడ్డి, జిన్నా తేజస్విని, కృతిక, హర్షవర్ధన్, అనూష, నిఖిత, భవ్య, శ్రీకృష్ణసాయి సాధించారన్నారు. తుది ఎంపికలు హైకోర్టు తుదితీర్పునకు లోబడి ఉంటాయని ప్రకటించారు.

హైకోర్టు కీలక తీర్పు

గ్రూ­ప్‌-1 అం­శం­లో టీ­జీ­పీ­ఎ­స్సీ­కి తె­లం­గాణ హై­కో­ర్టు­లో ఊరట లభిం­చిం­ది. సిం­గి­ల్‌ బెం­చ్‌ ఇచ్చిన తీ­ర్పు­పై హై­కో­ర్టు డి­వి­జ­న్‌ బెం­చ్‌ స్టే వి­ధిం­చిం­ది. గ్రూ­ప్‌-1 ని­యా­మ­కా­లు చే­ప­ట్టు­కో­వ­చ్చ­ని స్ప­ష్టం చే­సిం­ది. గ్రూ­ప్‌-1 తుది మా­ర్కుల జా­బి­తా, జన­ర­ల్‌ ర్యాం­కిం­గ్స్‌­ను రద్దు చే­స్తూ సిం­గి­ల్‌ బెం­చ్‌ తీ­ర్పు వె­లు­వ­రిం­చిం­ది. మె­యి­న్స్‌ జవా­బు పత్రా­ల­ను 8 నె­ల­ల్లో పు­నః­మూ­ల్యాం­క­నం చే­యిం­చా­ల­ని.. లే­దం­టే పరీ­క్ష­ల­ను రద్దు చేసి మళ్లీ ని­ర్వ­హిం­చా­ల­ని ఆదే­శిం­చిం­ది. సిం­గి­ల్‌ బెం­చ్‌ తీ­ర్పు­పై టీ­జీ­పీ­ఎ­స్సీ డి­వి­జ­న్‌ బెం­చ్‌­లో అప్పీ­ల్‌ చే­సిం­ది. దీ­ని­పై హై­కో­ర్టు­లో వి­చా­రణ జరి­గిం­ది. ప్ర­భు­త్వం తర­ఫున ఏజీ సు­ద­ర్శ­న్‌­రె­డ్డి వా­ద­న­లు వి­ని­పిం­చా­రు. ‘‘14 ఏళ్ల తర్వాత గ్రూ­ప్‌-1 ని­యా­మ­కా­లు జరు­గు­తు­న్నా­యి. తె­లు­గు­లో మె­యి­న్స్‌ జవా­బు­లు రా­సిన వా­రి­ప­ట్ల పక్ష­పా­తం చూ­పిం­చా­ర­న­డా­ని­కి ఎలాం­టి ఆధా­రా­లు లేవు’’ అని కో­ర్టు­కు ఏజీ తె­లి­పా­రు. దీ­ని­పై సీజే జస్టి­స్‌ అప­రే­శ్‌­కు­మా­ర్‌ సిం­గ్‌ స్పం­ది­స్తూ పక్ష­పా­తం చూ­పిం­చా­ర­న­డా­ని­కి ఆధా­రా­లు­న్నా­యా?అని ప్ర­శ్నిం­చా­రు. ఎలాం­టి ఆధా­రా­లు చూ­ప­లే­క­పో­యా­ర­ని ఏజీ తె­లి­పా­రు. దీంతో సిం­గి­ల్‌ బెం­చ్‌ తీ­ర్పు­పై స్టే వి­ధి­స్తూ డి­వి­జ­న్‌ బెం­చ్‌ ఆదే­శా­లు ఇచ్చిం­ది. తుది తీ­ర్పు­న­కు లో­బ­డే ని­యా­మ­కా­లు ఉం­టా­య­ని సీజే స్ప­ష్టం చే­శా­రు. వి­చా­ర­ణ­­కు అక్టో­బ­ర్ 15కు వా­యి­దా వే­శా­రు.

Tags

Next Story